న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానం అట్టహాసంగా జరిగింది. పారాలింపిక్స్లో (2004, 16, 20) మూడు పతకాలు సాధించిన దిగ్గజ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝారియాకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మభూషణ్ అవార్డు అందించారు. అవనీ లేఖరా (పారా షూటింగ్), వందన కఠారియా (హాకీ), ఫైజల్ అలీదార్ (మార్షల్స్ ఆర్ట్స్ కోచ్) పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మరో విడతలో నీరజ్ చోప్రా, ప్రమోద్ భగత్, సుమిత్ అంటిల్, శంకర్నారాయణ్ మీనన్, బ్రహ్మనంద్ సంక్వాల్కర్ పద్మ శ్రీ అవార్డు స్వీకరించనున్నారు.