న్యూఢిల్లీ, మార్చి 28: ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం ఓ కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది. బోయింగ్ 737-800 విమానం ప్రయాణికుల టెర్మినల్ నుంచి రన్వే మీదికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కుడివైపు రెక్క స్వల్పంగా దెబ్బతిన్నది. అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదు. ఈ విమానం జమ్ముకు వెళ్లాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. ప్రయాణికులను వేరే విమానంలో తరలించారు. ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించింది.