హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల కరోనా టీకాలు వేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో హరీశ్రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ఇప్పటికే అనేక రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నదని, ఇదే స్ఫూర్తితో కొవిడ్ వ్యాక్సినేషన్లోనూ ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామం.. ఏ ఒక మనిషి మిగలకుండా రెండు డోసులు వేయాలని ఆదేశించారు. పట్టణాల్లో జనాభా ఎకువ ఉంటే సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఏ కారణంవల్లనైనా ఏ జిల్లా కూడా వాక్సినేషన్లో వెనుకబడొద్దని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో ప్రక్రియ వేగంగా సాగుతున్నదని అభినందించారు. మిగతా జిల్లాల్లోనూ ఇదేస్థాయిలో జరగాలని తెలిపారు. ప్రతి డీఎంహెచ్వో స్థానికంగా ఉండి వ్యాక్సినేషన్ డ్రైవ్ను పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్తోపాటు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్పై వారంరోజుల తర్వాత కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.