హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కరోనా పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. అశ్రద్ధ చేయకుండా మాసులు ధరించటం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం వంటి మూడు ముఖ్యమైన స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి- వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతిభవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రోడ్లు భవనాలు, సాగునీటి పారుదలశాఖల్లో పనుల పురోగతిపై కూడా ఆ శాఖల అధికారులతో చర్చించారు. నిర్లక్ష్యం వహించకుండా రాష్ట్రంలోని ప్రతి ఒకరూ కొవిడ్-19 వాక్సిన్ వేయించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటికే 15-18 ఏండ్లవారికి వాక్సినేషన్ నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ధ్ద చేయకుండా అర్హులైన తమ పిల్లలకు టీకాలు వేయించాలని కోరారు.
60 ఏండ్లు పైబడిన వృద్ధులతోపాటు ఫ్రంట్లైన్ వరర్లు, హెల్త్కేర్ వరర్లకు సోమవారం నుంచి మూడో డోసు (బూస్టర్ డోసు) ప్రారంభించనున్నామని తెలిపారు. అర్హులందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో ప్రజలు గుంపులుగా కాకుండా ఎవరి ఇండ్లల్లో వారు పండుగ జరుపుకోవాలని సూచించారు.
ఆక్సిజన్ పడకలు, మందులు సిద్ధం
ఎలాంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదురొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధ్దంగా ఉన్నదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. గత సమీక్ష సందర్భంగా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు నివేదించారు.
ఆక్సిజన్ పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయని వివరించారు. సమావేశంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎంవో అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్రెడ్డి, వైద్యారోగ్యశాఖ అధికారులు శ్రీనివాసరావు, రమేశ్రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్రెడ్డి, రోడ్లు భవనాలశాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్తేజ, ఇంజినీర్ ఇన్ చీఫ్లు మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ పనులన్నీ సమాంతరంగా సాగాలి
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులన్నీ సమాంతరంగా, వేగంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్లో సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతోపాటు, ల్యాండ్ సేపింగ్, సచివాలయంలో ఏర్పాటుచేయాల్సిన రక్షణ వ్యవస్థ, ఇతర అనుబంధ భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి సూచించారు. సచివాలయానికి పటిష్ఠమైన భద్రతాచర్యలు తీసుకొంటున్న నేపథ్యంలో పోలీసులకు కావాల్సిన వసతులపై డీజీపీ మహేందర్రెడ్డితో సంప్రదించి చర్యలు చేపట్టాలని చెప్పారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.