హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం డిసెంబర్ 21, 23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి కొల్లాం వరకు (ట్రైన్ నంబర్ 07177), కొల్లాం నుంచి హైదరాబాద్కు (ట్రైన్ నంబర్ 07118) రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు సీపీఆర్వో పేర్కొన్నారు.