హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి – సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు ఈ నాలుగు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
వెలన్కాని నుంచి పాన్వెల్ స్టేషన్ల మధ్య ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 8వ తేదీన ఈ రైలు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.