నాగార్జునసాగర్ తీరాన 274 ఎకరాల్లో నిర్మితమైన మానవాద్భుత మహా కట్టడం బుద్ధవనం. గౌతమబుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జీవిత సన్నివేశాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుత శిల్పాల బుద్ధ చరితవనం. బుద్ధుని బోధనలను ప్రతిబింబించేలా 8 విభాగాలు. ప్రధానద్వారం వద్ద ఘనస్వాగతం పలికే గజరాజులు. ఆ వెనకే రెండువైపులా స్తంభాలపై మృగరాజులు. తలెత్తి చూస్తే ఆకాశానికి అతుక్కుపోయినట్టు కనిపించే అశోకచక్రం. లోపలికి వెళ్లగానే బుద్ధుడు సేద తీరుతున్నట్టు కనిపించే కృష్ణశిల, ఆ పక్కనే పాదుకలు..బుద్ధుడికి సంబంధించిన జీవిత ఘట్టాలు. ఆధ్యాత్మిక గురువు దలైలామా నాటిన బోధి వృక్షం.. ఇవీ నాగార్జునసాగర్ తీరాన కొలువుదీరిన బుద్ధవనం విశేషాలు. అహో! అమోఘం.. ఇది బుద్ధుడు నడిచిన నేలే! అన్నట్టు రూపుదిద్దుకున్న బుద్ధవనం. ఈ వీడియోలో మీరూ చూసి తరించండి.