యాదాద్రి, డిసెంబర్ 1 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ పత్రాలతో అర్చన చేశారు. దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. బాలాలయంలోని మహా మండపంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన, నిత్య తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. కార్తిక మాసం పురస్కరించుకుని భక్తులు స్వామి, అమ్మవార్లకు దీపారాధన చేపట్టారు. కొండకింద పాతగోశాల వ్రత మండపంలో ఆధికసంఖ్యలో భక్తులు సత్యనారాయణ వ్రత పూజలు చేశారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ. 15,16,144 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న టీఎస్పీఎస్సీ సభ్యుడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కారం రవీందర్రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి వేదాశీర్వచనం ఇవ్వగా, అధికారులు స్వామి ప్రసాదం అందించారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,99,334
రూ.100 దర్శనం టిక్కెట్ 76,000
నిత్యకైంకర్యాలు 4,351
వేద ఆశీర్వచనం 13,932
క్యారీబ్యాగుల విక్రయం 8,700
ప్రచారశాఖ 11,000
వ్రత పూజలు 3,38,000
కల్యాణకట్ట టిక్కెట్లు 19,400
ప్రసాద విక్రయం 4,51,720
వాహన పూజలు 8,500
టోల్గేట్ 1,290
అన్నదాన విరాళం 9,833
సువర్ణ పుష్పార్చన 1,27,260
యాదరుషి నిలయం 85,950
పాతగుట్ట నుంచి 61,530