ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీ ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు స్వామివారికి పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం పట్టువస్త్రాలు ధరింపచేసి ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనం కల్పించారు. మహిళా భక్తులు పాలపొంగళ్లు తయారు చేసి స్వామివారికి నివేదించారు.