ముంబై: ఈ యేటి ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కేక పుట్టిస్తున్న విషయం తెలిసందే. అతను వేస్తున్న స్పీడ్ బంతులకు ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. 150 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ విసురుతున్న బంతుల్ని ఎదుర్కోవడం ఎవరి తరం కావడం లేదరు. అయితే సన్రైజర్స్ బౌలర్పై తాజాగా బీసీసీఐ చైర్మెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఈ యేటి ఐపీఎల్ సీజన్లో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్రాన్పై ప్రశంసలు కురుపిస్తూ .. జమ్మూకశ్మీర్ బౌలర్ నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నట్లు చెప్పారు. ఐపీఎల్ టోర్నీని చాలా ఆసక్తితో చూస్తున్నానని, ఏ జట్టైనా గెలిచే అవకాశాలు ఉన్నాయని, అందరూ అద్భుతంగా ఆడుతున్నారని, గుజరాత్- లక్నో కొత్త జట్లు కూడా అమోఘంగా ఆడుతున్నాయని, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్ కూడా రాణిస్తున్నారని, కానీ ఉమ్రాన్ మాలిక్ ఈ టోర్నీలో హైలెట్ అని గంగూలీ అన్నారు.