అమరావతి : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం మద్యం సేవించి తల్లి కంచుమోజు రమణ(55)ను కుమారుడు రాంబాబు దాడి చేసిన చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఆమె ఈరోజు మృతి చెందింది.
ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడి అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.