హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పని చేసిన సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్రనాథ్రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలోకి ప్రవేశించి క్రికెట్ బ్యాట్తో దాడికి దిగాడు. గతేడాది కూడా సురేంద్రనాథ్ సూరీడుపై దాడికి పాల్పడ్డాడు. భార్యను వేధింపులకు గురి చేస్తుండడంతో గతంలో సురేంద్రనాథ్పై గృహహింస కేసు నమోదైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సూరీడుపై సురేంద్రనాథ్ ఒత్తిడి తీసుకువస్తున్నాడు. కేసును ఉపసంహరించుకోకపోవడంతో కక్షతో మామను హత్య చేసేందుకు యత్నించాడు. సూరీడు కుమార్తె గంగా భవానీ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, సురేంద్రనాథ్ను అరెస్టు చేశారు.