హైదరాబాద్ : వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అద్భుత విజయం సాధించిన అనంతరం నేడు తెలంగాణ శాసన మండలికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి , పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లతో కలిసి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శాసన మండలి ఆవరణలో పల్లాను శాలువాతో సన్మానించి అభినందించారు.