కాలు, చెయ్యికి అయ్యే గాయాలకు ల్యాబ్ టెస్టులు, వైద్యుల అవసరం లేకుండానే చికిత్స అందించే ‘స్మార్ట్ బ్యాండేజీ’ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొబైల్ యాప్ సాయంతో పనిచేసే ఈ బ్యాండేజీ సాయంతో పేషెంటే స్వయంగా వైద్యం చేసుకోవచ్చు.
సెన్సర్ సాయంతో గాయానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక మొబైల్ యాప్కు చేరవేసేదే ‘స్మార్ట్ బ్యాండేజీ’. ‘వీ-కేర్’ సాంకేతికత సాయంతో ఈ బ్యాండేజీని తయారుచేసినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.
గాయంపై ఈ బ్యాండేజీ వేయగానే.. పట్టీపై పూసి ఉంచిన ఔషధపు పొర గాయాన్ని నయం చేయడం ప్రారంభిస్తుంది. గాయం ఉష్ణోగ్రత, స్రవిస్తున్న ద్రవాలు, వాపు వంటి విషయాలను బ్యాండేజీకి అమర్చిన సెన్సర్.. మొబైల్ యాప్కు చేరవేస్తుంది. గాయం నయమైందో లేదో తెలుసుకునేందుకు బ్యాండేజీని పారదర్శక పదార్థంతో తయారు చేశారు.
రక్తస్రావానికి సంబంధించిన గాయాలు, కాలిన గాయాలు, పుండ్లు, డయాబెటిస్-క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగా వచ్చే పొక్కులు.