తిరుపతి : తిరుపతి ఆదివారం మధ్నాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ 39 హెచ్ఏ 4003 అనే నంబర్ గల కారు చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం వద్ద వేగంగా వచ్చి డివైడర్ను ఢీ కొట్టింది బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించి దగ్దమయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని సమీపంలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందగా మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రెండు కుటుంబాలు ఐదు రోజుల క్రితం శ్రీవారి దర్శనం చేసుకుంది. అక్కడి నుంచి కాణిపాకానికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.