రుద్రంగి, మార్చి 30: పౌర హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ సునీత తెలిపారు. వీరునితండా పంచాయతీలో ఆర్ఐ సునీత ఆధ్వర్యంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. కులవివక్ష పాటిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. ఎంపీడీవో శంకర్, ఎం పీవో సుధాకర్, సర్పంచ్ గుగులోత్ మేనా, గుగులోత్ మోహన్, లావుడ్యా నరహరి, సిబ్బంది, కార్యదర్శి శ్రీను, ఏఎన్ఎంలు ఉన్నారు.
గంభీరావుపేట, మార్చి 30: ముచ్చర్లలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవానికి ఎస్ఐ సౌమ్యారెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఉంటూ సకల వసతులు పొందాలని సూచించారు. ఎస్ఐని సర్పంచ్ తేజావత్ రజిత, ఎంపీటీసీ స్వప్న సన్మానించారు.
వేములవాడ రూరల్, మార్చి 30: వేములవాడ రూర ల్ మండలం బాలరాజుపల్లిలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ దివ్య, సర్పంచ్ ఏశ తిరుపతి, అంబేద్కర్ సంఘం నాయకులు నేదూరి నర్సయ్య, శ్రీనివాస్, రాజు, మలయ్య ఉన్నారు.
వీర్నపల్లి, మార్చి 30: మద్దిమల్లతండాలో నిర్వహిం చిన పౌరహక్కుల దినోత్సవంలో ఏఎస్ఐ సంజీవయ్య, ఆర్ఐ శ్రీనివాస్, సర్పంచ్ జవహార్, కార్యదర్శి రాములు, టీఆర్ఎస్ నేత సంతోష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.