జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, డీఎంహెచ్వో సుమన్మోహన్రావు
కొదురుపాక, కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం
కోనరావుపేట, మార్చి 30: ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యా క్సిన్ తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ను ఆమె ప్రారంభించి, మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తం గా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించలన్నారు. టీకాపై అపోహలు వద్దని, తాను కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ ఎం పీపీ చంద్రయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బండ నర్సయ్యయాదవ్, వైద్యాధికారి మోహన్కృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నర్సింహాచారి, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ డీ తిరుపతి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు.
వ్యాక్సిన్తో సమస్యలు లేవు
కరోనా టీకాతో ఎలాంటి సమస్యలు లేవని డీఎంహెచ్వో సుమన్మోహన్రావు పేర్కొన్నారు. కొదురుపాక పీహెచ్సీలో వ్యాక్సినేషన్ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలో పది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీకా వేసుకునే వారు భయాందోళనకు గురికావద్దన్నారు. ఉప సర్పంచ్ రవిచందర్ టీకా వేయించుకున్నారు. ఇక్కడ జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, వైద్యాధికారులు మహేశ్, డా.శ్రీఖర్, మీనాక్షి, ఉప సర్పంచ్ హైజేబు రవిచందర్, నాయకుడు కత్తెరపాక కొండయ్య, సిబ్బంది, ఏఎన్ఎంలు ఉన్నారు.