సిరిసిల్ల టౌన్, మార్చి 30: కేంద్రం అమలులోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలు వెంటనే సవరించాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీ య అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాం డ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంట ను ఎక్కడ విక్రయించుకోవాలో చట్టాల్లో స్పష్టం గా పేర్కొనలేదన్నారు. ఈ చట్టం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, అన్నదాతలను రోడ్డు పాలు చేసే విధంగా ఉందని విమర్శించారు. పేదలకు నష్టం కలిగించే విధంగా ఉన్న వ్యవసాయ, విద్యు త్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నా రు. 50నిండిన రైతులకు 5వేల పింఛన్, 5 లక్షల ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించాలని ఏప్రిల్ 23న కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో రైతు మహాగర్జన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య ఉన్నారు.