Siddu Jonnalagadda First Love Story | టాలీవుడ్ యూత్ ఐకాన్ సిద్దు జొన్నలగడ్డ తన స్టయిలిష్ నటనతోనే కాదు, నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతోను అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు తన ఫస్ట్ లవ్ స్టోరీను పంచుకుంటూ ప్రేక్షకుల మనసులు తాకేలా చేశాడు. ఆయన చెప్పిన వన్ సైడ్ లవ్ కథ ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. లవ్ అనే ఫీలింగ్ని దాటకుండా ఎవరు ఉండలేరు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక్కరిపైనా ఆ ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది అంటూ సిద్దు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
నేను కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేవాడిని. 7వ తరగతిలోనే ఒక అమ్మాయిపై ప్రేమ కలిగింది. కానీ ఆమెకు నేను ఎప్పుడూ చెప్పలేదు. పదవ తరగతి చివరికి వచ్చినప్పుడు, స్కూల్ చివరి రోజు ఆమె దగ్గరకు శ్లామ్ బుక్ తో వెళ్లాను. ఆమె తన ల్యాండ్ లైన్ నంబర్ రాసి, ఒక లుక్ ఇచ్చి… సైకిల్ పై వెళ్లిపోయింది. ఆ సీన్ ఇప్పటికీ క్లియర్గా గుర్తుంది అని గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత ఆ అమ్మాయి ఎవరి జీవితంలోకి వెళ్ళిందో, ఎలాంటి ప్రయాణం కొనసాగించిందో తెలియదు. అయితే సిద్దు మాత్రం మళ్లీ ఆమెని కలవలేదట.
కొన్నేళ్ల తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆమె ప్రొఫైల్ చూశాను. అప్పటికే ఆమెకు పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. నేరుగా మాట్లాడకపోయినా, అప్పుడప్పుడు ఆమె ప్రొఫైల్ చూస్తుంటాను అంటూ మనసులోకి దాచుకున్న ప్రేమని బయటపెట్టాడు. సిద్దు ఇలా తన ‘రియల్ లైఫ్ రాధిక’ గురించి చెప్పిన వెంటనే, నెటిజన్లు ‘ఆమె ఎవరు?’, ‘ఇప్పటికీ టచ్లో ఉన్నారా?’, ‘ఫోన్ నంబర్ ఇచ్చిన అమ్మాయి తానేనా “టిల్లు రాధిక”కి ప్రేరణ ఆమేనా?’ అంటూ ఆసక్తికర చర్చలు మొదలుపెట్టారు. సిద్దు సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాగా, నీరజ కోన దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అక్టోబర్ 17న సినిమా థియేటర్లలో మూవీ విడుదల కాబోతుంది.