ఆరుతడి పంటలను ఆదాయ మార్గాలుగా మలుచుకున్నారు. ఒకరు మూడెకరాల్లో తీరొక్క కూరగాయలు, ఆకుకూరలు పండిస్తుండగా, మరొకరు తనకున్న ఏడున్నర ఎకరాల్లో మూడు ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి, ఎకరాలో బంతి తోట, మిగతా ఒకటిన్నర ఎకరాల్లో ఆకుకూరలు సాగు చేస్తున్నారు. రోజుకు సుమారు రూ.1300 నుంచి రూ.1500 దాకా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
జహీరాబాద్, నవంబర్ 16: వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, సీజన్లో ధరలు ఉండే పంటలు సాగు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని రంజోల్కి చెందిన మరుపు అలీ, ఫక్రుద్దీన్ అన్నదమ్ములు. వీరికి 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ భూమిలో వీరు వ్యవసాయ పంటలు సాగు చేయకుండా కూరగాయల పంటలు సాగు చేస్తారు. ప్రతి పంట 90 రోజుల్లోపు వచ్చే కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసి ప్రతి 90 రోజులకు ఎకరానికి ఖర్చులు పోను సుమారు రూ.50వేల ఆదాయం పొందుతున్నారు. తమకు ఉన్న వ్యవసాయ భూమిలో పుదీనా, కొత్తిమీర, పాలకూర, టమాట, వంకాయ, గోరుచిక్కుడు, బిన్నీస్, చిక్కుడుకాయ, బెండ, పెద్ద చిక్కుడు, చామ గడ్డ, ముల్లంగితో పాటు పలురకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రతి సీజన్కు సంబంధించిన పంటలు సాగు చేసి లాభాలు పొందుతున్నారు. కూరగాయలు, ఆకు కూరలు బిందు సేద్యంతో సాగు చేస్తున్నారు. వీరు పండించిన కూరగాయలు వారాతంపు సంతతో పాటు కూరగాయల మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు.
సిద్దిపేట (నవంబర్16): అతడి పొలం వద్ద నిత్యం ఏదో ఒక ఆకుకూరల సాగు కనిపిస్తుం ది. ఉదయమే 7 గంటలకు కుటుంబంలోని నలుగురు వ్య క్తులు పొలం వద్దకు చేరుకుంటా రు. 10 గంటల కల్లా కూరలు కోసి కట్టలు కట్టి మార్కెట్కు వెళ్లి అమ్ముకువస్తారు. ఇది సిద్దిపేట పట్టణ పరిధిలోని గాడిచేర్లపల్లికి చెందిన రైతు పకిడి తిరుపతి దిన చర్య. 18 సంవత్సరాలుగా ఆకుకూరలను సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నాడు. ఆకుకూలరల సాగుతో మంచి లాభాలున్నాయి. మార్కెట్ ఎక్కువగా కావడంతో ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో రైతు తిరుపతి 18 సంవత్సరాలుగా ఆకు కూరలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. తనకున్న ఏడున్నర ఎకరాల భూమిలో 3 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి, ఎకరాలో బంతి తోటలను మిగతా ఒకటిన్నర ఎకరాల్లో ఆకు కూరలను సాగు చేస్తున్నాడు. సంవత్సరరంలో 10 నెలలు కచ్చితంగా ఆకుకూరలను పండిస్తారు. ముఖ్యంగా తోటకూర, పాలకూర, కోతిమీర, మెంతికూరలతోపాటు పలురకాల ఆకుకూరలను సాగు చేస్తున్నాడు. రైతు తిరుపతి కుటుంబ సభ్యులు ఉదయం 7గంటలకు పొలం వద్దకు వెళ్లి 10 గంటల వరకు కూరలు కోసి కట్టలు కడుతారు. వాటిని తిరుపతి సిద్దిపేటలోని మార్కెట్కు తరలించి అమ్ముకువస్తాడు. రోజుకు సుమారు రూ.1,300 నుంచి రూ.1,500 ఆకుకూరలకు వస్తుంది. అంటే ప్రతి నెల రూ.35,000 నుంచి రూ.45,000ల ఆదాయం పొందుతున్నారు. ఆకుకూరల సాగుకు పెట్టుబడి సుమారు రూ.60 వేల వరకు అంటే సంవత్సరంలో రూ.లక్షా 80వేలు పెట్టుబడి వస్తుంది. సుమారుగా సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆదాయం రైతు పొందుతున్నాడు. అలాగే, బంతి పువ్వులు రోజుకు 35 కిలోలు అమ్ముతున్నారు. మార్కెట్లో బంతి పువ్వులు రూ.50కి పైగా ఉంది. రోజుకు రూ.1,500 వరకు గిట్టుబాటు అవుతుంది. రెండు నెలలు సీజన్ కాబట్టి రూ.50,000 నుంచి రూ.60 వేలు వస్తుంది. దీనికి రూ.12,000వేలు పెట్టుబడి పోనూ రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నారు. వినూత్నంగా ఆలోచించి శ్రమిస్తే వ్యవసాయంలో అద్భుతాలు చేయవచ్చని రైతులు నిరూపిస్తున్నారు. మూస ధోరణి విడితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది.
బిందు సేద్యంతో అధిక దిగుబడులు..
రైతులు కొత్త పద్ధతిలో బిందు సేద్యంతో కూరగాయలు సాగుచేసి అధిక లాభాలు పొందుతున్నారు. ప్రతి సీజన్కు సంబంధించి కూరగాయలు, ఆకుకూరలు అమ్మకాలు చేస్తారు. ఉన్న పొలంలో పంటలు మార్పుచేసి సాగు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తాం..
మాకు ఉన్న వ్యవసాయ భూమిలో కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నాం. ప్రతి సీజన్కు సంబంధించిన కూరగాయలు సాగు చేస్తున్నాం. బోరుకు బిందు సేద్యం పరికరాలు ఏర్పాటు చేసి సాగు చేస్తున్నాం. ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ అమ్మకాలు చేస్తాం. ప్రతి పంటను అంతర పంటగా సాగు చేస్తాం.
18 ఎండ్ల నుంచి ఆకుకూరలు సాగు చేస్తున్నాం..
18 ఏండ్లుగా మేం ఆకుకూరలను సాగు చేస్తున్నాం. ఎకరన్నర పొలంలో సంవత్సరంలో 10 నెలలు ఆకుకూరలు వేస్తాం. రోజూ ఇంట్లోని నలుగురం బావి వద్దకు వెళ్లి ఉదయం 10 గంటల వరకు ఆకు కూరలను కోసి కట్టలు కడుతాం. వీటిని నేను సిద్దిపేట పాత మార్కెట్. రైతు బజార్లో వ్యాపారులకు వేసి వస్తా. రోజుకు 1200 నంచి 1500 కట్టలు అమ్ముతాం. మంచి ఆదాయం ఉంది. పండుగల సీజన్లో బంతి పూలు సాగు చేస్తాం.