అమరావతి : వైజాగ్ ఆర్కే బీచ్(Vizag Beach)లో అనుమానాస్పద స్థితిలో( Suspicious Death) శవమై కనిపించిన వివాహిత గురువెల్లి శ్వేత (24) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఎవరూ హత్య చేయలేదని , ఆమె మనస్తాపంతో విశాఖ బీచ్లో ఆత్మహత్య చేసుకుందని విశాఖ సీపీ(Visaka CP) త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు.
శ్వేత ఇంటిలో లభించిన సూసైడ్ నోట్(Suicide Note), శ్వేత మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడయిందని ఆయన పేర్కొన్నారు.అయితే శ్వేత పేరుపై ఉన్న ఆస్తితో పాటు ఆడపడుచు, ఆమె భర్త లైంగిక వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.
శ్రీకాకుళం(Srikakulam) జిల్లా మూలాపేటకు చెందిన శ్వేత రైల్వే ఆసుపత్రిలో ఉద్యోగం చేసేది. ఉద్యోగరీత్యా ఐదేళ్లుగా విశాఖలోని దొండపర్తిలో శ్వేత నివాసం ఉండేది. గతేడాది ఏప్రిల్ 15న నడిపూరు గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్(Software Engineer) మణికంఠతో శ్వేతకు వివాహమైంది. అప్పటి నుంచి అత్తమామలతో కలిసి నడిపూరులోనే శ్వేత ఉంటోంది. భర్త మణికంఠ 15 రోజుల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి వెళ్లాడు.
అప్పటి నుంచి తరుచుగా అత్తమామలతో శ్వేతకు గొడవలు జరుగుతున్నాయని తల్లి రమాదేవి పోలీసులకు వివరించింది. ఈనెల 25న అత్తతో శ్వేతకు మరోసారి గొడవ జరిగింది. ఇదే విషయమై భర్త మణికంఠతో కూడా ఫోన్లో వాగ్వాదం జరిగింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె మరుసటి రోజు 26వ తేదీన వైజాగ్ ఆర్కే బీచ్లో శవమై తేలింది.