దుబాయ్: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో హ్యాట్రిక్ అర్ధ సెంచరీలతో విజృంభించిన భారత యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(600) ఐసీసీ ర్యాంకుల్లో జోరు కనబర్చాడు. టీ20 బ్యాటింగ్ విభాగంలో 27 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్కు చేరుకోగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(612) టాప్-10 జాబితా నుంచి వైదొలిగాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో శ్రీలంక సిరీస్కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఐదు స్థానాలు వెనుకబడి 15వ ర్యాంకుకు చేరుకోగా, కేఎల్ రాహుల్(646) పదో ర్యాంక్లో ఉన్నాడు.
బౌలింగ్లో భువనేశ్వర్(586) మూడు స్థానాలు మెరుగుపడి 17వ ర్యాంక్లో నిలువగా.. టెస్టు బౌలింగ్లో రవిచంద్రన్ అశ్విన్(839) రెండో ర్యాంక్లో ఉండగా.. ఆల్ రౌండర్ విభాగంలో అశ్విన్(330), రవీంద్ర జడేజా (326) వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకుల్లో స్థిరంగా కొనసాగుతున్నారు.