కోల్కతా: అంతా ఊహించినట్లే కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టు.. శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమించింది. గతేడాది జట్టును నడిపించిన ఇయాన్ మోర్గాన్ను మెగా వేలంలో తిరిగి తీసుకోని నైట్రైడర్స్.. శ్రేయస్ అయ్యర్ను రూ. 12.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకుంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు నాయకత్వం వహించిన శ్రేయస్.. 2020 సీజన్లో ఆ జట్టును ఫైనల్కు చేర్చిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతలపై శ్రేయస్ స్పందిస్తూ.. ‘కోల్కతా జట్టుకు నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. అందరినీ కలుపుకొనిపోతూ నిర్దేశించిన లక్ష్యాలని చేరుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు.