భోపాల్ : పండ్ల రసంలో మత్తు మందు కలిపి వివాహిత(40)పై లైంగిక దాడికి పాల్పడి బ్లాక్మెయిలింగ్కు దిగిన షాపు యజమాని ఉదంతం మధ్యప్రదేశ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోను చూపుతూ ఆమెను బెదిరించి పలుమార్లు దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడి భార్య ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. వీడియో బహిర్గతం కావడంతో బాధితురాలి కుమార్తె ఆందోళన చేపట్టింది. తల్లీ కూతుళ్లపై నిందితుడు, ఆమె భార్య దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన మీదట నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019 మేలో వివాహిత పని నిమిత్తం నిందితుడి షాపుకు వెళ్లారు. ఆమెకు మత్తుమందు కలిపిన ఫ్రూట్ జ్యూస్ ఇచ్చిన నిందితుడు ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను రికార్డు చేసి పలుమార్లు ఆమెను బెదిరించి లోబరుచుకున్నాడు. ఇటీవల ఆ వీడియోను నిందితుడి భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బహిర్గతమైంది. దీంతో నిందితుడిని నిలదీసిన బాధితురాలు, ఆమె కుమార్తెపై నిందితుడి భార్య దాడికి పాల్పడింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని స్ధానిక పోలీస్ అధికారి చంద్రకాంత్ పటేల్ పేర్కొన్నారు.