భోపాల్: మధ్యప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్లో అరుదైన దృశ్యం కనిపించింది. ఆ సమావేశంలో సీఎం కుర్చీలో మహాకాలేశ్వరుడి ఫోటోను పెట్టారు. ఇది మహాకాలేశ్వరుడి ప్రభుత్వమని, ఇక్కడే ఆయన రాజు అని, మహాకాల్ మహారాజు నేలపై నేతలందరూ సేవ కోసం వచ్చరాని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ఉజ్జెయిన్లో మహాకాలేశ్వరుడి ఆలయం ఉన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 11వ తేదీన ప్రధాని మోదీ మహాకాలేశ్వర్ టెంపుల్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ భేటీలో సీఎం కుర్చీలో మహాకాలేశ్వరుడి ఫోటోను పెట్టారు. ఇక 900 మీటర్ల కారిడార్లో శివుడు, శక్తికి చెందిన సుమారు 200 విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జెయిన్లో తొలిసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన కుర్చీలో శివుడి ఫోటోను పెట్టి సమావేశాన్ని నిర్వహించారు.