రాయ్పూర్, మార్చి 26: ఓ భూకబ్జా కేసులో సాక్ష్యాత్తూ కైలాసనాథుడు శివుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలతో ఛత్తీస్గఢ్లోని రాయగఢ్ అధికారులు ఇటీవల 10 మందికి నోటీసులిచ్చారు. ఆ భూమిలో శివాలయం కూడా ఉండటంతో అధికారులు జాబితాలో ఆలయంలోని దేవుడిని కూడా చేర్చారు. దీంతో శుక్రవారం కోర్టు విచారణకు హాజరైన మిగతా తొమ్మిది మంది ఇలా ఆలయంలోని శివలింగాన్ని రిక్షాలో రాయగఢ్ కోర్టుకు తీసుకొచ్చారు.