యాదాద్రి, మార్చి 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం ఏప్రిల్ 25న పునఃప్రారంభం కానున్నది. ఇందుకు తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ ము హూర్తం ఖరారు చేసినట్టు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ 21న శివాలయ ఉద్ఘాటనకు అంకురార్పణ జరిపి 25న శివాలయాన్ని పునఃప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు. మరో రెండ్రోజుల్లో తొగుట పీఠాధిపతి వద్దకు వెళ్లి ప్రారంభోత్సవ సమయంలో ఐదురోజులపాటు నిర్వహించే హోమాలు, మూల మంత్రా లు, పూజల విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది సెప్టెంబర్ 18న శివాలయ ధ్వజ స్తంభం, కర్రలు, ఇత్తడి కలశాలు, తొడుగులకు శుద్ధి పూజలు చేశారు.