న్యూఢిల్లీ: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని ఆగస్టు 22వ తేదీ వరకు పొడగించారు. పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నాడు. అయితే అతని కస్టడీని మళ్లీ పొడిగించారు. ఇవాళ ఈడీ కోర్టు ముందు ఆయన్ను హాజరుపరిచారు. సంజయ్ రౌత్ను ముంబైలోని ఆర్తర్ రోడ్డు జైలుకు తరలించనున్నారు. పత్రాచాల్ రీడెవలప్మెంట్ స్కీమ్లో ఆర్థిక అక్రమాలు జరిగాయని, ఆ కేసులో సంజయ్ను ఈడీ అరెస్టు చేసింది. ఇంటి నుంచి తెచ్చిన ఆహారం, మందుల్ని వాడుకునేందుకు సంజయ్కు అనుమతి ఇవ్వాలని అతని తరపున న్యాయవాది కోరాడు. ఈ అభ్యర్థనలకు కోర్టు అనుమతి ఇచ్చింది.