న్యూఢిల్లీ: ఐపీఎల్ ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. కానీ పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేదు. శిఖర్ ధావన్ 38.3 సగటుతో 14 మ్యాచుల్లో పంజాబ్ తరపున 460 రన్స్ చేశాడు. అయితే ఆ జట్టు నాకౌట్ దశకు చేరకపోవడంతో ధావన్ తండ్రి సీరియస్ అయ్యాడు. ధావన్ తన ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ధావన్ను అతని తండ్రి కొడుతున్నట్లుగా ఉంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్లు ధావన్ తండ్రిని అడ్డుకుంటున్నట్లు ఆ వీడియోలో చూపించారు.
అయితే ఎప్పుడు సరదా వీడియోలు పోస్టు చేసే ధావన్ ఈసారి కూడా ఇలా తన అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. తమ జట్టు నాకౌట్ దశకు క్వాలిఫై కాలేదని తమ తండ్రి ఇలా కొడుతున్నారని తన వీడియోకు ధావన్ ఓ ట్యాగ్ పోస్టు చేశాడు. సరదగా సాగిన ఆ వీడియోకు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్, పంజాబ్ టీమ్ ప్లేయర్ హర్ప్రీత్ బ్రార్ రియాక్ట్ అయ్యారు. ఈసారి ఐపీఎల్ జాబితాలో పంజాబ్ జట్టు ఆరవ స్థానంలో ఉంది.