హరారే : వన్డే క్రికెట్లో శిఖర్ ధావన్ కొత్త మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో 6500 పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ ఘనతను అతను దాటేశాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. ధావన్ వన్డేల్లో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. హరారేలో జరుగుతున్న మ్యాచ్లో ప్రస్తుతం ధావన్ ఫుల్ జోష్లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ దిశగా అతను కొనసాగుతున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 190 పరుగుల లక్ష్యాన్ని విసిరిన విషయం తెలిసిందే. ఇండియా ఇప్పటి వరకు 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 79 రన్స్ చేసింది.