న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ ఇవాళ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల మీదు ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్ చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఇన్స్పిరేషన్తో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్ చేశారు. శివాజీకి నౌకాదళం ఉన్న నేపథ్యంలో ఆయన ప్రేరణతో ఆ జెండాలో గుర్తును కలిపారు. బ్లూ కలర్ ఆక్టోగోనల్ ఆకారంలో ఉన్న గుర్తును నేవీ జెండాలో డిజైన్ చేశారు. అష్టాకారంలో ఉన్న గుర్తులో రెండు గోల్డ్ కలర్ బోర్డర్లు ఉన్నాయి. శివాజీ నేవీ ముద్రను పోలినట్లు ఈ కొత్త డిజైన్ను రూపొందించారు. శివాజీ దళంలో సుమారు 60 యుద్ధ నౌకలు ఉండేవి. అతని వద్ద 5000 మంది నావికులు ఉండేవారు. శివాజీ పాలన సమయంలో మరాఠా నౌకాదళం శక్తివంతంగా ఉండేది. తీర ప్రాంతాన్ని ఆ దళం నిత్యం రక్షిస్తూ ఉండేది. అష్టాకారం అంటే ఎనిమిది దిక్కులు అని, అన్ని దిక్కుల్లోనూ నౌకాదళం అబేధ్యంగా ఉన్నట్లు గుర్తుండే రీతిలో ఆ ముద్రను డిజైన్ చేసినట్లు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.
"Bharat Bhagya Vidhata!"
WATCH | New Naval Ensign 'Nishaan', hoisted on #INSVikrant in the presence of Prime Minister @narendramodi. pic.twitter.com/vDPFUSDcU0
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) September 2, 2022