హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళలను వేధిస్తూ పట్టుబడుతున్న ఆకతాయిల్లో 19 నుంచి 35 ఏండ్లవారే అధికంగా ఉంటున్నారు. రాష్ట్రంలో షీటీమ్స్ ఏర్పాటై 7 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మహిళా భద్రత విభాగం వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం తెలంగాణ పోలీసులు గత ఏడేండ్లలో 12,847 మంది ఆకతాయిల భరతం పట్టారు. పట్టుబడ్డ నిందితులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు కేసు తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.