న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలాన్ని మూడేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో డిసెంబర్ 2024 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ పదవీకాలాన్ని పొడిగించడం ఇదే తొలిసారి. 25వ ఆర్బీఐ గవర్నర్గా డిసెంబర్ 11, 2018లో నియమితులైన విషయం తెలిసిందే. అనూహ్య పరిణామాల మధ్య ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం మూడేండ్ల కాలపరిమితితో దాస్ను గవర్నర్గా నియమించిన విషయం తెలిసిందే.