Asia Cup 2023 : ఆసియా కప్ సూపర్ 4లో నామమాత్రమైన మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయారు. దాంతో, బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టన్ షకిబుల్ హసన్(80), తౌహిద్ హృదోయ్(54) అర్ధ శతకాలతో అదుకోగా.. చివర్లో వచ్చిన నసుమ్ అహ్మద్(44) దంచి కొట్టాడు. దాంతో, బంగ్లా పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే 3 వికెట్లతో రాణించాడు.
టాస్ ఓడిన బంగ్లాదేశ్ పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ లిట్టన్ దాస్()ను షమీ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ తంజిద్ హసన్(13)ను శార్థూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. అనాముల్ హక్(4)ను కూడా శార్దూల్ పెవిలియన్ పంపాడు. దాంతో బంగ్లా 10 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది.
Bangladesh recover well from 59-4 to reach a solid total 💪
A 101-run partnership between Shakib and Hridoy was key 🔑 #INDvBAN LIVE ▶️ https://t.co/AMJLzWVWJV#AsiaCup2023 pic.twitter.com/1pIysC6CeU
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2023
అలాంటిది 265 పరుగులు చేయగలిగిందంటే అందుకు కారణం షకిబ్, తౌహిద్. వీళ్లిద్దరూ ధాటిగా స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. సెంచరీకి చేరువగా ఉన్న షకిబ్ను ఠాకూర్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఫిఫ్టీ పూర్తి చేసుకున్న యువ ఆటగాడు తౌహిద్ను షమీ ఔట్ చేశాడు. దాంతో, బంగ్లా చాపచుట్టేస్తుందని అనుకున్నారంతా. కానీ, నుసుహ్ భారత బౌలర్లను ఉతికారేస్తూ బంగ్లాకు భారీ స్కోర్ అందించాడు.