ఎల్లుండి షేక్పేట వంతెన ప్రారంభం
టోలిచౌకి, ఐటీ కారిడార్ను అనుసంధానించే షేక్పేట ఫ్లైఓవర్ నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. జనవరి 1న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ నూతన ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. రూ.333.55 కోట్లతో టోలిచౌకి నుంచి షేక్పేట నాలా మీదుగా 2.87 కి.మీ.పొడవున దీన్ని నిర్మించారు. టోలిచౌకి ఫ్లైఓవర్, షేక్పేట ఫ్లైఓవర్ ఎక్కితే నేరుగా ఐటీ కారిడార్లోకి ప్రవేశించొచ్చు. గోల్కొండ కోట,సెవన్టూంబ్స్కు వచ్చే వారికి షేక్పేట ఫ్లైఓవర్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. -మెహిదీపట్నం