ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను అగ్ర హీరో వెంకటేష్ ఆవిష్కరించారు. ఓ హాంటెడ్ హౌస్ వద్ద హీరో ఆది పినిశెట్టికి కొన్ని వింత సంఘటనలు ఎదురుకావడం, అక్కడ కొన్ని విచిత్రమైన శబ్దాలను ఆయన రికార్డు చేయడం.. వంటి సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది.
టీజర్లో చిత్ర ప్రధాన తారాగణం మొత్తాన్ని చూపించారు. ‘ఈ సినిమా కోసం 120 ఏళ్ల నాటి లైబ్రరీని నిర్మించాం. యూనిక్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సాంకేతికంగా కూడా ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సంగీతం: తమన్ ఎస్, నిర్మాత: సెవెన్ జీ శివ, రచన-లైన్ ప్రొడ్యూసర్-దర్శకత్వం: అరివళగన్.