హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో ముగ్గురు రిస్క్ దేశాలకు చెందినవారు కాగా.. నలుగురు ఇతర దేశాల నుంచి వచ్చినవారని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62కు పెరిగింది. మంగళవారం రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి 165 మంది ప్రయాణికులు రాగా.. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్గా తేలింది. ఇతర దేశాల నుంచి వచ్చినవారికి ర్యాండమ్గా నిర్వహించిన పరీక్షల్లో మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.
ఒక్కరోజే 228 మందికి కరోనా
మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 228 కేసులు వెలుగు చూశాయి. 185 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 41 వేలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 110, మేడ్చల్ మల్కాజిగిరిలో 20, రంగారెడ్డిలో 19 కేసులు వెలుగు చూశాయి.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 4.14 లక్షల కొవిడ్ టీకాలు వేశారు. ఇందులో 72,213 మందికి మొదటి డోస్ వేయగా, 3.42 లక్షల మందికి రెండో డోస్ వేశారు. మొదటి డోస్ 100 శాతం మందికి వేసినట్టు బులెటిన్లో వెల్లడించారు. రాష్ట్రంలో 25.23 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి.