హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కొత్త పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) కోరింది. ఈ మేరకు గురువారం టీఎస్ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింది. పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యను పరిష్కరించాలని నేతలు ఎంఏ వజీర్, నగేశ్, అబ్దుల్తఖీ కోరారు.