న్యూఢిల్లీ, నవంబర్ 13: రెండు గంటల కంటే తక్కువ ప్రయాణం ఉండే విమానాల్లో భోజన సేవలు పునఃప్రారంభించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సడలించేందుకు సమీక్ష చేస్తున్న విమానయాన శాఖ అభ్యర్థన మేరకు ఆరోగ్యశాఖ ఈ మేరకు సూచన చేసింది. విమాన సిబ్బంది ఇక పీపీఈ కిట్ల తరహాలో శరీరం మొత్తం ధరించాల్సిన అవసరం లేదని, అయితే చేతులకు గ్లవ్స్, ముఖానికి మాస్కు, ఫేస్షీల్డ్ తప్పనిసరిగా ధరించాలని ఆరోగ్య శాఖ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.