చిక్కడపల్లి : జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటో కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ( Mla Mutha Gopal) అన్నారు. బుధవారం గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో స్వచ్ఛ ఆటో కార్మికులకు రెయిన్ కోట్స్ (Rain coats ) పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు (Sanitation Workers), స్వచ్ఛ ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించి వారికి సీఎం కేసీఆర్ (CM KCR ) వేతనాలు పెంచారని వివరించారు. ప్రజలు కూడా స్వచ్ఛ ఆటోలనే చెత్తను అందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల (Teachers) సేవలు ప్రసంశ నీయమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అడిక్మెట్ డివిజన్ విద్యానగర్ వివేకానంద హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత పాఠశాలలు, విద్యా బోధనలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.