న్యూఢిల్లీ, డిసెంబర్ 1: బూస్టర్ డోసుగా కొవిషీల్డ్ టీకాను వినియోగించేందుకు అనుమతివ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) భారత ఔషధ నియంత్రణ సంస్థకు (డీసీజీఐ) దరఖాస్తు చేసుకొన్నది. దేశంలో బూస్టర్ డోసు వేయడానికి తగినన్ని కొవిషీల్డ్ డోసులు ఉన్నాయని అందులో పేర్కొన్నది. యూకేలో అస్ట్రాజెనెకా(ఇండియాలో కొవిషీల్డ్) టీకాను ఇప్పటికే బూస్టర్ డోసుగా వినియోగిస్తున్నారని గుర్తు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో బూస్టర్ డోసు అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.