ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్య ప్రకాశ్ సుర్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉద్దవ్ వర్గానికి చెందిన పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే వాళ్ల చేతుల్ని విరగగొట్టాలని, లేదంటే వాళ్ల కాళ్లను విరగ్గొట్టాలని, ఆ తర్వాత రోజు వచ్చి తాను బెయిల్ ఇప్పించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ముంబైలోని మగథానే ప్రాంతంలోని కొకని పద బుద్ద విహార్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరిక దాదాగిరి నడవదని, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే, వాళ్లకు ఎదురు తిరగాలని ఎమ్మెల్యే ప్రకాశ్ అన్నారు. ఎవరితోనూ గొడవపడమని, కానీ ఎవరైనా కొట్లాడితే, వాళ్లను తాము వదలబోమన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన ఠాక్రే వర్గం దహిసార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.