హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ని నిజామియా దవాఖానలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన చర్యలను వివరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శిథిలావస్థలో ఉన్న ఈ దవాఖాన భవనం గురించి పత్రికల్లో వచ్చిన వార్తను హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్ ధర్మాసనం సుమోటో వ్యాజ్యంగా పరిగణించి మంగళవారం విచారణ జరిపింది.
భవనంలోని బాలికల వసతి గృహాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించాలని సీఎస్, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, వైద్యవిద్య డైరెక్టర్, దవాఖాన సూపరింటెండెంట్కు నోటీసులు జారీచేసి, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.