సికింద్రాబాద్,జనవరి5: సికింద్రాబాద్ నియోజకవర్గం ఓటర్ల జాబితా డ్రాఫ్ట్రోల్ సిద్ధమైంది. పలు కసరత్తుల అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు బుధవారం ఓటర్ల జాబితాకు తుదిరూపు ఇచ్చారు.
చిరునామాల మార్పులు, తప్పొప్పుల సవరణలు, కొత్తగా పేర్లు నమోదు, తొలగింపుల అనంతరం కొత్త జాబితాను జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఎన్నికల అధికారి పి. మోహన్రెడ్డి విడుదల చేశారు. ఈ డ్రాఫ్ట్రోల్కు ఎన్నికల కమిషన్ అధికారులు లాంఛనంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు సిద్ధం చేసిన 2022 ఓటర్ల జాబితా డ్రాఫ్ట్రోల్ ప్రకారం సికింద్రాబాద్ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 2,56, 273కు చేరింది. ఇందులో పురుషులు 1.29, 676, స్త్రీలు 1,26,579, ఇతరులు 18 మంది ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.