అడ్డగుట్ట, జనవరి 22: అభివృద్ధిలో సికింద్రాబాద్ నియోజకవర్గం దూసుకుపోతున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. శనివారం తుకారాంగేట్లో జరుగుతున్న ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి) నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తి చేస్తున్నదని అన్నారు.
పెండింగ్ పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రూ.29.50 కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లకు పైగా నిధులను ఇప్పటికే మంజూరు చేసిందని, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సైతం ఇప్పటికే నిధులను మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.