అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 12న కెన్యా నుంచి చెన్నైకి వచ్చిన మహిళ(39) అక్కడి నుంచి తిరుపతికి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆమెను ఈనెల 12న పరీక్షగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆమె శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు బుధవారం వెల్లడించారు.
నవంబర్ 27 విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏండ్ల యువకుడు ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా సొంత జిల్లాకు చేరుకున్నాడు. ముంబైలో పరీక్షించిన వైద్యులు అతడికి కరోనా నెగిటివ్ వచ్చింది. మరోసారి అతడు విజయనగరంలో పరీక్షించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ శాంపిల్ను పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపగా డిసెంబర్ 11న ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు.