న్యూఢిల్లీ: సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్(సీపీఆర్)లో ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గవర్నింగ్ బోర్డు చైర్మెన్గా మీనాక్షి గోపినాథ్ ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పొలిటికల్ సైంటిస్టు. లేడీ శ్రీరామ్ కాలేజీలో ప్రిన్సిపాల్ కూడా. సీపీఆర్కు ఇప్పుడు ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా యామిని అయ్యర్ చేస్తున్నారు. ఒకప్పుడు సీపీఆర్కు ప్రతాప్ భాను మెహతా హెడ్గా కొనసాగారు. ఇవాళ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఐటీశాఖ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఫండింగ్కు సంబంధించిన అంశంలో ఐటీశాఖ తనిఖీలు నిర్వహిస్తోంది.
1973లో సీపీఆర్ను స్థాపించారు. స్వచ్ఛంధ సంస్థగా, వ్యక్తిగత సంస్థగా సీపీఆర్ తనకు తాను గుర్తింపు ఇచ్చుకుంది. అత్యంత నాణ్యమైన రీతిలో పరిశోధనలు చేపడుతుంది. భారతీయుల ప్రజా జీవితంపై ప్రభావం చూపే అంశాలపై పాలసీలను రూపొందిస్తుంది.