న్యూఢిల్లీ : వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ పాలసీ ప్రకారం ఎవరైనా తమ వాహనాలకు తుక్కుకు ఇస్తే.. వారికి బలమైన ప్రోత్సహాకాలు ఇవ్వనున్నది. పర్సనల్ వాహనాలకు రోడ్డు ట్యాక్స్లో 25 శాతం రిబేట్ ఇవ్వనున్నది. అలాగే కమర్షియల్ వాహనాలకు 15 శాతం మినహాయింపు కల్పించనున్నారు. స్క్రాప్ సర్టిఫికేట్తో కొత్త వాహనాన్ని కొన్న వారికి అయిదు శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభ, రాజ్యసభల్లో స్క్రాపింగ్ పాలసీ విధానం గురించి ఆయన వివరించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, అన్ఫిట్గా ఉన్న వాహనాలను తీసివేసేందుకు స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. ఒకవేళ మీరు మీ పాత వాహనాన్ని తుక్కుకు ఇస్తే, అప్పుడు దానికి కొత్త వాహనంపై 4 నుంచి 6 శాతం వరకు తుక్కు విలువ కట్టి డిస్కౌంట్ ఇవ్వనున్నారు. స్క్రాపింగ్ సర్టిఫికేట్తో కొత్త వాహనాన్ని కొన్ని వారికి రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మినహాయింపు కల్పించనున్నారు. రోడ్డు ట్యాక్స్లో కూడా రిబేట్ ఇవ్వనున్నట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు.