న్యూఢిల్లీ, జనవరి 30: సముద్ర జీవులైన అక్టోపస్లు కోట్ల ఏండ్ల క్రితం అంతరిక్షం నుంచి భూమ్మీద పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మంచుతో కూడుకొన్న ఓ ఆస్టరాయిడ్లో ఇవి పుట్టి ఉండొచ్చని పేర్కొన్నారు. అంతరిక్షంలో జీవం ఉనికిపై శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా ఓ ఉల్కలో మంచును గుర్తించారు. ఇలాంటి మంచు ఉల్కల్లో కోట్ల ఏండ్ల క్రితం అక్టోపస్లు ఉండేవని భావిస్తున్నారు. ఈ వివరాలను బయోఫిజిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ జర్నల్లో ప్రచురించారు.