Singapore | న్యూఢిల్లీ, మార్చి 29: కృత్రిమ మేథ రాకతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తున్నది. ఇందుకోసం పూర్తికాల డిప్లొమా కోర్సును రూపొందించింది. 40 ఏండ్ల పైబడినవారు ఈ కోర్సులు చదవడానికి 90 శాతం ఫీజు రాయితీ కూడా అందిస్తున్నది.
ప్రస్తుతం 40 ఏండ్ల పైబడిన ఉద్యోగులు తాము 20 ఏండ్ల క్రితం చదువుకున్న చదువులకు, ఇప్పటి చదువులకు ఎంతో మార్పు ఉంటుందని ఆ దేశ పార్లమెంట్ ఎంపీ టాన్ ఊ మెంగ్ తెలిపారు. ‘అనుభవజ్ఞులైన ఉద్యోగులు తమ జీవితానుభవాలను. జీవన నైపుణ్యాలను తరగతి గదిలోకి తీసుకొస్తారు. అలాగే యువ విద్యార్థులతో కలిసి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకొంటారు’ అని మెంగ్ అభిప్రాయపడ్డారు.